సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
BREAKING NEWS
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం జమాల్పురం సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ గ్రామంలో ఇద్దరు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.గోదారి వీరన్న కూతురు మానస,లాదెల్ల హేమంత్ భార్య సౌజన్యలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షల చెక్కులను సర్పంచ్ పంపిణీ చేశారు.చెక్కులు అందుకున్న బాధితులు మాట్లాడుతూ…
“ప్రభుత్వం ద్వారా ఆసుపత్రి ఖర్చులకు రూ.1.20 లక్షల చెక్కులు అందించిన ఎమ్మెల్యే నాగరాజుకు చెక్కులు రావడానికి కృషి చేసిన సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ గారికి,ప్రభుత్వానికి ఋణపడి ఉంటాం”అని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అభిమానులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.