గ్రామ ప్రజల విన్నపం మేరకు ప్రభుత్వ భూమికి హద్దురాళ్ళు ఏర్పాటు చేసిన డీఐ మాచర్ల రాజు
గళం న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ గడ్ మేజర్ గ్రామ పంచాయతి పరిదిలోని సర్వే నెంబర్ 1645 లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని గత కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక సర్పంచ్ బల్లెపు వెంకట నరసింగరావు అక్రమించుకొని సాగుచేసుకుంటుండగా గ్రామస్తులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.దానితో ప్రభుత్వ అధికారి డీఐ మాచర్ల రాజు ఫీల్డ్ మీదికి వచ్చి ప్రభుత్వ భూమికి హద్దురాల్లు ఏర్పాటు చేశారు.స్పందించిన అధికారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
