మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి
ఈనెల 11 నుంచి ఇండ్ల గణన
మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి మరిపెడ మండల వ్యాప్తంగా ఇండ్ల గణన సర్వే చేపట్టనున్నట్లు తహసీల్దార్ కృష్ణవేణి తెలిపారు. మండలాన్ని మొత్తం 158 బ్లాకులుగా విభజించి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 87 మంది ఎన్యూమరేటర్లు (ఉపాధ్యాయులు), 14 మంది సూపర్వైజర్లు పాల్గొని గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు చెప్పారు. సర్వే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ సర్వే ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగానున్నట్లు తెలిపారు. ఇండ్ల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.
కచ్చితత్వంతో నిర్వహించేందుకు అధికారులకు ఇప్పటికే అవసరమైన సూచనలు జారీ చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.