ఆదర్శ విద్యా నికేతన్ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలుఆదర్శ విద్యా నికేతన్ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

తెలుగుగళం న్యూస్, పెద్దవడుగూరు.

స్థానిక ఆదర్శ విద్యా నికేతన్ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కరణం నారాయణ రావు జ్యోతి ప్రజ్వలన చేసి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని కొనియాడారు. విద్యార్థులను క్రమశిక్షణ గల ఉత్తమ పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, ఆదర్శ విద్యా నికేతన్ ఉపాధ్యాయ బృందం అందిస్తున్న విద్యా సేవలు ఎంతో అభినందనీయమని ఆయన స్పష్టం చేశారు.వేడుకల్లో భాగంగా పాఠశాల సీనియర్ విద్యార్థులు ఉపాధ్యాయుల దుస్తులు ధరించి, ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి చిన్న తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయ వృత్తిలోని బాధ్యతను, సవాళ్లను స్వయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు మరియు గురువుల గొప్పతనాన్ని చాటే నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువులకు విద్యార్థులు ప్రత్యేక గ్రీటింగ్ కార్డులు, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక ‘గురువందనం’ సమర్పించారు.పాఠశాల ప్రిన్సిపాల్ కరణం నారాయణ రావు చేతుల మీదుగా ఉపాధ్యాయులందరినీ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. విద్యాబోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *