hyderabad newshyderabad news

బుధవారం బర్కత్పురా లోని రత్న జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులుగా వి ఉమా శంకర్ ప్రధాన కార్యదర్శిగా పి సుధాకర్ రెడ్డి కోశాధికారిగా సిపి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులుగా అహ్మద్ హుస్సేన్ ఎండి ఉస్మాన్ జాయింట్ సెక్రెటరీగా సిద్ధికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఎండి అక్రమ్ షేక్ హైదర్ సలహాదారులుగా వి హనుమంతరావు డాక్టర్ ఎస్. శ్రావణ్ కుమార్ లు ఎన్నికయ్యారు ఎన్నిక పరిశీలకులుగా విష్ణువర్ధన్ రెడ్డి కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ బాలకృష్ణారెడ్డి లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇవ్వకముందే కొన్ని కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఆపేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా 360 కాలేజీలకు ఉన్న మిక్స్డ్ ఆక్స్పెన్సి సమస్యను పరిష్కరించాలని పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్సీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *