గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లో ఓటు వేసేందుకు అర్హత కోసం అర్హత ఉన్న పట్టభద్రులు ఫిబ్రవరి 6 వ తేదీ లోగా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు పొందినా కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. 01.11.2020 తేదీ లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే నమోదు చేసుకోవాలి. కావున అర్హులయిన ప్రయివేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రయివేటు టీచర్స్,గవర్నమెంట్ టీచర్స్,నిరుద్యోగులు,విద్యార్థులు,2020, నవంబర్ కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు క్రింది లింక్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోగలరు. శుక్రవారం రోజున వాజేడు మండలలో బీజేపీ అధ్యక్షులు కందుల రామ్ కిషోర్ కల్లూరి వినోద్ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వటం జరిగింది.
e69 news telugu news local news