రాజ్యాంగం అందించిన సమానత్వం వల్లే తాను ఈ స్థాయికి వచ్చాను-కడియం

ఈ69న్యూస్ వరంగల్ బ్యూరో రిపోర్ట్

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో “జై బాపు-జై భీమ్-జై సంవిధాన్” నినాదాలతో పాదయాత్ర నిర్వహించారు. గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం అందించిన సమానత్వం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రోత్సహిస్తూ,రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి లకావత్ దన్వంతి,ఇతర నేతలు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *