ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన కొత్తపల్లిగోరి ఎస్‌ఐ దివ్యప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన కొత్తపల్లిగోరి ఎస్‌ఐ దివ్య

జిల్లాలో విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం, శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందించిన ఎస్సై దివ్యకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది.77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారిగా ఎస్సై దివ్య ఎంపికై,అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ప్రజల సమస్యలను ఓర్పుతో విని,వేగంగా పరిష్కరించడంలో ముందుండే ఎస్సై దివ్య, విధి నిర్వహణలో క్రమశిక్షణ, న్యాయపాలన పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారని ఉన్నతాధికారులు ప్రశంసించారు.ముఖ్యంగా మహిళలు, యువత, సామాన్య ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడంలో ఆమె పాత్ర కీలకమని తెలిపారు.ఈ సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో డీఎస్పీ, ఎస్పీ తదితర పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై దివ్యను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ గౌరవం జిల్లాలోని పోలీస్ శాఖకు, ముఖ్యంగా మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, ప్రజల మన్నన పొందుతున్న ఎస్సై దివ్యకు లభించిన ఈ గుర్తింపు, ఆమె సేవలకు తగిన గుర్తింపుగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *