అహ్మదీయ ముస్లిం జమాత్ తర్భీయతీ సమావేశంఅహ్మదీయ ముస్లిం జమాత్ తర్భీయతీ సమావేశం

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో తర్భీయతీ సమావేశం ఘనంగా నిర్వహించారు. దావతే ఇలల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక జమాత్ అధ్యక్షుడు ముహమ్మద్ బషీర్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, రాష్ట్ర దావతే ఇలల్లా సెక్రటరీ మౌల్వీ ముహమ్మద్ అక్బర్, దావతే ఇలల్లా జిల్లా సెక్రటరీ ముహమ్మద్ ఖాజామియా, వివాహ సంబంధాల సెక్రటరీ మౌల్వీ ముహమ్మద్ మస్తాన్ పాషా హాజరై ప్రసంగించారు.వారు జమాత్ సభ్యులకు ఆధ్యాత్మిక అభివృద్ధి, నైతిక విలువలు, కుటుంబ వ్యవస్థ బలోపేతం, యువతలో క్రమశిక్షణ, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై విశదీకరించారు.జమాత్ అభివృద్ధి కోసం సభ్యులు ఐక్యంగా పనిచేయాలని, పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, యువతను సద్గుణాల దిశగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమాజ సేవా కార్యక్రమాలు, మతపరమైన శిక్షణా తరగతులు, సామాజిక సహకార కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని నాయకులు గుర్తు చేశారు. ప్రతి కుటుంబం జమాత్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా సంఘ బలాన్ని పెంపొందించవచ్చని తెలిపారు.సమావేశంలో జమాత్ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, సభ్యుల సూచనలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జమాత్ ఉపాధ్యక్షుడు ముహమ్మద్ వసీం, స్థానిక నాజిం అన్సారుల్లాహ్ నాసిర్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ముహమ్మద్ నజీర్, స్థానిక మౌల్వీ నూరుద్దీన్, భాషా, రసూల్, అంకూశావలి, యాకూబ్ పాషా, రియాజ్, హుస్సేన్, బషీర్ ,తాహిర్, ఫయాజ్, రహీం, అఖిల్, ఫాజిల్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *