విలక్షణ నటుడు ఘటోత్కచుడు యమధర్మరాజు సినీ అభిమానులను అలరించి 878 సినిమాల్లో నటించి ఎంపీ గా పని చేసిన స్వర్గీయ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలకు నేడు మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హాజరై నివాళులు అర్పించారు. కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేసినప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, సత్యనారాయణ గారు తనతో ఆత్మీయంగా, సన్నిహితంగా ఉండేవారని మంత్రి ఆయన కొడుకులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. స్వర్గీయ సత్యనారాయణ గారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారితో,, టిడిపి పార్టీతో అవినాభావ సంబంధం ఉన్నదని, అన్నగారు సత్యనారాయణ గారికి ఎంతో గౌరవం ఇచ్చేవారని స్మరించుకున్నారు. కైకాల సత్యనారాయణ నటుడిగా, రాజకీయ నేతగా చేసిన సేవలకు గుర్తింపుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించారని తెలిపారు. సత్యనారాయణ గారు లేని లోటు పూడ్చలేనిదని..ఆయన భౌతికంగా మనను విడిచి వెళ్లినప్పటికీ నటుడిగా, మంచి వ్యక్తిగా ఎప్పటికీ మనతోటే ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.