
అన్ని మతాల పర్వదినాలకు సమ ప్రాధాన్యత…. ఎమ్మెల్యే అరూరి.
క్రిస్మస్ పండుగ సంధర్బంగా వరంగల్, హన్మకొండ మండలాల పరిధిలోని పేద క్రైస్తవులకు పైడిపల్లి బెత్లేహమ్ బాప్టిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవ సోదరీ, సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం 3,14వ డివిజన్ పరిధిలోని 5గురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు లక్షా 86వేల రూపాయల విలువ గల చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు ముఖ్య మంత్రి కేసీఆర్ గారు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పేద, ధనిక అనే తార తమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద క్రైస్తవుల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, కార్పొరేటర్లు జన్ను శిభారాణి అనిల్, తూర్పటి సులోచన సారయ్య, ఇతర ప్రజా ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గోన్నారు.