ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి
ఈరోజు పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాల
పీజీ కళాశాల యజమానియాలతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కారు అన్నారు గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది అన్నారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు.గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పిజి కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బందుకు బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ,1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసిందన్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య రంగ సమస్యల పై అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను మరియు ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలు మరియు ఇంజనీరింగ్ కళాశాలలు యూనివర్సిటీలు బందుకు పిలుపునివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ బందులో విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు