తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం కలెక్టర్ కు అందజేత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ రైతు సంఘం వినతిపత్రం అందజేత భూక్య చందు నాయక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 29 తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలో నిర్వహించారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ కు అందజేశారు.అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ సమావేశానికి హాజరైన స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి రైతాంగ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు.మరియు జనగామ మండలంలోని గానుగుపాడు క్రాస్ వద్ద రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సర్వే చేసి సందర్శించి సమస్యలను గుర్తించారు.ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని ట్రాన్స్పోర్టు లారీలను తరగతిలో పంపించి ధాన్యం లిఫ్టింగ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు :- 1. ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టి తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. 2. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రవాణా ట్రాన్స్పోర్ట్ లారీలు రాకపోవడం వలన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కావున తక్షణమే పరిష్కారం చేయగలరు. 3. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి సకాలంలో అందించాలి. 4.పి.ఎ.సి.ఎస్. సహకార సంఘాలకు కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలి. 5. తాలు, తరుగు మట్టి షాటేజీ (కొరత) పేరుతో రైతుల ధాన్యం, మిల్లర్ల కట్టింగును అరికట్టాలి. 6. షాటేజీ (కొరత) మరియు పొట్టి రకం దాన్యం పేరుతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మిల్లులను సీజ్ చేయాలి. 7. మిల్లర్ల వర్కింగ్ చార్జీలు 18 కోట్ల రూపాయలు విడుదల చేసి, రైతుల ధాన్యం దిగుమతి చేసుకొని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. 8. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం తీసుకు రావడం వలన లారీలు సుదూర ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని, కాబట్టి గ్రామాలకు దగ్గర ఉన్న 20 కిలో మీటర్ల లోపు ఉన్న మిల్లులకు ట్యాగ్ చేయాలీ. 9.40 కిలోల 650 గ్రాముల మాత్రమే ధాన్యం కాంటా వేయాలనే నిబంధనలు ఉన్నప్పటికిని 41 కిలోలకు పైగా ఉండాలని మిల్లర్ల షరతు పెట్టి ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 10. వ్యవసాయ శాఖ ఏఈవోలు పొట్టి గింజలు సి గ్రేడ్ ధాన్యం అని సెంటర్లలో చెక్చేసి టోకెన్ ఇవ్వాలి. 11. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి. ఇట్టి ధర్నా కార్యక్రమాలను జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న రైతులను నాయకులను అరెస్టు చేసి సొంత పూచికతపై విడిపించారు. అదేవిధంగా సిఐ సందర్శించారు.ఈ కార్యక్రమంలో వడ్లకొండ గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గానుగు పహాడ్ సర్పంచ్ అనూష మహిపాల్ ముదిరాజ్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గానుగు పహాడ్ ఉపసర్పంచ్ కుర్ర శంకర్ నాయక్ పెద్ద తండా ఎం ఉపసర్పంచ్ గోగులోతు ఝాన్సీ రాజు నాయక్ వివిధ గ్రామాల గ్రామాల రైతులు భారీ ఎత్తున హాజరయ్యారు.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం కలెక్టర్ కు అందజేత
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ రైతు సంఘం వినతిపత్రం అందజేత
భూక్య చందు నాయక్
తెలంగాణ రైతు సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 29
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలో నిర్వహించారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ కు అందజేశారు.అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ సమావేశానికి హాజరైన స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి రైతాంగ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు.మరియు జనగామ మండలంలోని గానుగుపాడు క్రాస్ వద్ద రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సర్వే చేసి సందర్శించి సమస్యలను గుర్తించారు.ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని ట్రాన్స్పోర్టు లారీలను తరగతిలో పంపించి ధాన్యం లిఫ్టింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యలు :-
- ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టి తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
- జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రవాణా ట్రాన్స్పోర్ట్ లారీలు రాకపోవడం వలన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కావున తక్షణమే పరిష్కారం చేయగలరు.
- జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి సకాలంలో అందించాలి.
4.పి.ఎ.సి.ఎస్. సహకార సంఘాలకు కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలి. - తాలు, తరుగు మట్టి షాటేజీ (కొరత) పేరుతో రైతుల ధాన్యం, మిల్లర్ల కట్టింగును అరికట్టాలి.
- షాటేజీ (కొరత) మరియు పొట్టి రకం దాన్యం పేరుతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మిల్లులను సీజ్ చేయాలి.
- మిల్లర్ల వర్కింగ్ చార్జీలు 18 కోట్ల రూపాయలు విడుదల చేసి, రైతుల ధాన్యం దిగుమతి చేసుకొని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం తీసుకు రావడం వలన లారీలు సుదూర ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని, కాబట్టి గ్రామాలకు దగ్గర ఉన్న 20 కిలో మీటర్ల లోపు ఉన్న మిల్లులకు ట్యాగ్ చేయాలీ.
9.40 కిలోల 650 గ్రాముల మాత్రమే ధాన్యం కాంటా వేయాలనే నిబంధనలు ఉన్నప్పటికిని 41 కిలోలకు పైగా ఉండాలని మిల్లర్ల షరతు పెట్టి ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - వ్యవసాయ శాఖ ఏఈవోలు పొట్టి గింజలు సి గ్రేడ్ ధాన్యం అని సెంటర్లలో చెక్చేసి టోకెన్ ఇవ్వాలి.
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి.
ఇట్టి ధర్నా కార్యక్రమాలను జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న రైతులను నాయకులను అరెస్టు చేసి సొంత పూచికతపై విడిపించారు. అదేవిధంగా సిఐ సందర్శించారు.ఈ కార్యక్రమంలో వడ్లకొండ గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గానుగు పహాడ్ సర్పంచ్ అనూష మహిపాల్ ముదిరాజ్
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గానుగు పహాడ్ ఉపసర్పంచ్ కుర్ర శంకర్ నాయక్ పెద్ద తండా ఎం ఉపసర్పంచ్ గోగులోతు ఝాన్సీ రాజు నాయక్ వివిధ గ్రామాల గ్రామాల రైతులు భారీ ఎత్తున హాజరయ్యారు.