E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
యోధుల పోరు బాటలో పయనించాలి పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్

నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామ సర్పంచ్ పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ గీతాన్ని బాలబాలికలు,గ్రామపెద్దలు,వార్డు సభ్యులు ముక్తకంఠంతో ఆలపించారు.
శ్రీదేవి నాటి స్వతంత్ర పోరాటయోధులు గాంధీ,నెహ్రూ,సుభాష్,అజాద్ ల పోరాట గాథల గూర్చి వివరించారు.ఆ దిశగా ప్రజలు పయనించాలన్నారు.
ఈ కార్యక్రమంలో: గ్రామ పంచాయతీ కార్యదర్శి,కార్మికులు పాల్గొన్నారు.
