22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర
  • టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయం
  • సుబ్లేడులో షోయబుల్లా ఖాన్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం
  • నియోజకవర్గాల వారీగా కొనసాగను‌న్న యాత్ర
  • విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి పిలుపు
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈనెల 22వ తేదీ నుంచి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్ – 2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టినట్లు చెప్పారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జర్నలిస్టు, కవి షోయబుల్లా ఖాన్‌ వర్ధంతిని పురస్కరించుకొని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని అయన విగ్రహం వద్ద నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. సుబ్లేడులో మొదలయ్యే ఈ పాదయాత్ర అక్కడి నుంచి నేరుగా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండల కేంద్రాలతో పాటు ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో కొనసాగుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లోని జర్నలిస్టులతో కలిసి సాగే ఈ పాదయాత్రకు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలపాల్సిందిగా కోరారు. ఇళ్ల స్థలాల సాధన కోసం నియోజకవర్గాల వారీగా సాగే ఈ పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *