- టి ఎస్ ఎల్ పి ఆర్ బి చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావుకీ వినతి DYFI SFI AIYF AISF PDSU
ఎస్ఐ , కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలను సరిచేసి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రశ్నాపత్రంలో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు అభ్యర్థులందరికీ ఏడు మార్కులు కలపాలని, ఈవెంట్స్ సెలక్షన్ లో ఎత్తును కొలిచేందుకు తీసుకువచ్చిన డిజిటల్ విధానాన్ని రద్దు చేసి పాత మాన్యువల్ పద్ధతుల్లోనే కొనసాగించాలని, లాంగ్ జంప్ 3.8 మీటర్స్ నుండి 4 మీటర్స్ కి పెంచడాన్ని వెనక్కి తీసుకొని 3.8 మీటర్స్ నే కొనసాగించాలని, 1600/800 మీటర్స్ రన్ ను చేదించిన అభ్యర్థులను మెయిన్స్ ఎగ్జామ్ కు అనుమతించాలని AIYF AISF DYFI SFI PDSU ఖమ్మం జిల్లా సమితులు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ రావుకి వినతి పత్రం సమర్పించారు
ఈ సందర్భంగా DYFI రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్, AIYF జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ AISF జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ SFI జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ PDSU జిల్లా కార్యదర్శి మస్తాన్ లు మాట్లాడుతూ. పోలీస్ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఎల్ పి ఆర్ బి ఘోర వైఫల్యం చెందిందని తప్పును సర్దిపుచ్చుకోవడానికి మొండి ధోరణితో ముందుకు వెళుతుందని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెట్టి ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ రిక్రూట్మెంట్ విషయంలో జరిగిన అవకతవకలను సరిచేసి వెంటనే అభ్యర్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ,కానిస్టేబుల్ , అభ్యర్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో.AIYF జిల్లా నాయకులు శేకిల్ ,కౌశిక్ DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్,కూరపాటి శ్రీను, శీలంవీరబాబు, కొంగర నవీన్ శభాష్ రెడ్డి, నాగరాజు,పవన్,నరేష్.
AISF జిల్లా ఉపాధ్యక్షులు యువరాజు సతీష్. SFI జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు