రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మేకగుడ లోగల నాట్కో ఫార్మా లిమిటెడ్( కెమికల్ డివిజన్) ఎంప్లాయీస్ అసోసియేషన్ 2023 నూతన కేలండర్ ను షాద్ నగర్ ఏసిపి కుషాల్కర్ ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకోవాలని, పారిశ్రామిక శాంతి ని కాపాడాల్సిన బాధ్యత సంఘాలపై ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పినపాక ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిషోర్, హరికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు నాగభూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికుమర్, సహాయ కార్యదర్శి రాజీ రెడ్డి, రాంచందర్, ఏలీయా కోషాదికారి పిచ్చయ్య, సభ్యులు నరసింహ రెడ్డి,బల్వంత్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆంజనేయులు, బాలా చారి, విల్సన్, వెంకటేష్, సుభాష్ రెడ్డి, రవి కుమార్, రవీందర్ రెడ్డి,రామరాజు ,పాండు, రాములు, యాది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.