- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బిజెపి సర్కారు అనుసరిస్తున్న వ్యవసాయ, సహకార వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల వల్లే రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పేర్కొన్నారు. తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా 2వ మహాసభలు శివమ్ గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు చాల్లారపు తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నక్క యాదవ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగాయి. ముందుగా రైతు సంఘం సీనియర్ నాయకులు నక్క యాదవ రెడ్డి సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం శోభన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారీ నీటి ప్రాజెక్టులతో వ్యవసాయ రంగానికి ఒక ఊపు వచ్చిందన్నారు. 1990లో ప్రధాని పివి.నరసింహారావు హయాం నుంచి అమలైన నయా ఉదారవాద విధానాలు వ్యవసాయ, సహకార రంగాల పాలిట శాపంగా మారాయని అన్నారు. సహకార రంగంపై కేంద్రంలో ఒక శాఖ ఏర్పాటు చేసి దానికి అమిత్ షాను మంత్రిగా చేయడమంటే వ్యవసాయ, సహకార రంగాలను కార్పొరేటీకరణ చేస్తున్నారనడానికి సంకేతమని పేర్కొన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయి దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం, సహకార రంగాలపై పూర్తిగా ఆధారపడేదని పేర్కొన్నారు. ఈ రంగాల నడ్డివిరిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూల విధానాలతో వెళ్తున్నాయని తెలిపారు.
పసిబిడ్డలు తాగే పాలపైనా జిఎస్టిని మోడీ సర్కారు విధించడం దారుణమని అన్నారు. లీటరు పాలకు రూ.4 సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ రాష్ట్రంలో ఎక్కడా అమలు కావట్లేదని తెలిపారు. దేశంలో తొమ్మిది కోట్ల కుటుంబాలు, రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు ఆధారపడిన పాడి పరిశ్రమను ధ్వంసం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి ముడోజు కనక చారి, తిప్పరపు శ్రీనివాస్, కత్తుల భాస్కర్ రెడ్డి , నాయకులు బద్దిపడగ కృష్ణా రెడ్డి, బెజాడి మల్లారెడ్డి, మోకు దేవేందర్ రెడ్డి,ఆముదాల నర్సిరెడ్డి,తదితరులు పాల్గొన్నా