మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గండ్రతి సతీష్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అధికారిక పత్రాలపై సంతకాలు చేసి విధుల్లో చేరిన ఆయన మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.,ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందిస్తామని, ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని స్పష్టం చేశారు.మండలం లోని ప్రజలు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా పోలీసువారికి సహకారం అందించాలని వారి సూచనలు పాటించాలని కోరారు.