మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో
శుక్రవారం రోజున ముళ్లకట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరుపున మండల మహిళ కమిటీ సహాయంతో ఇటీవల చింత అరుణ, నరేష్ కుమారుడు అనారోగ్యంతో మరణించగా మండల సహాయ కార్యదర్శి ఈసం జనార్దన్, మండల ST సెల్ కార్యదర్శి సొనప కిరణ్ వారి కుటుంబాన్ని పరామర్శించి చిన్న పెద్ద కర్మలకు వారి కుటుంబానికి 25kg ల బియ్యం సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింత రవి, తోలెం అర్జున్, ఈసం ఇంద్ర, గడిగ విశ్వనాధం, అన్యబోయిన రామనాధం, గడిగ శ్రీకాంత్, వావిలాల సత్యం, గడిగ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.