కర్నూలు జిల్లా స్థానిక బి క్యాంపు నందు గల యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో రమాబాయి అంబేద్కర్ 125 వ జయంతి కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి లు రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ తన బిడ్డల మరణాలు మాకు ధారపోసి ప్రపంచ మేధావి, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాకు అందించి, మమ్మల్ని ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మాత రమాబాయి గారి త్యాగం వెలకట్టలేనిది. అంబేద్కర్ గారి విజయాల వెనుక రమాబాయి గారి కృషి మరువలేనిది. ఆకాశమంత మీ త్యాగం మహిళలకు స్పూర్తి అని ఆమె తెలిపారు.