క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించేవిదంగా చర్యలు తీసుకోవాలి

చెన్నూరు, నేన్నెల మండలాల్లో పత్తి కాలిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్‌

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం,ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చెసి సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ఈ సందర్బంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత వారం రోజులుగా మార్కెట్లలో పత్తి ధరలు క్వింటాలుకు 7000 రూపాయలకు తగ్గించి మధ్య దళారులు విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. కానీ కనీసం మద్దతు ధర 6380 ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి ఈసారి 9800 కింటలకు అమ్మకాలు సాగాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అదే ధర కొనసాగుతుంది. తెలంగాణలో వ్యాపారులు మిలాఖత్‌ అయి పత్తి ధరను 7వేల రూపాయలకు తగ్గించారు. నాణ్యత ప్రమాణాలు పేరు చెప్పి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశారు. అధిక వర్షాల వలన 8 లక్షల ఎకరాలలో పత్తి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. రెండుసార్లు వేసిన పంట మరింత దెబ్బతిన్నది. ఎకరాకు 2-5 క్వింటాళ్ల లోపు మాత్రమే పంట పండుతుంది. ఎకరానికి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు కానీ 30 వేలకు మించి ఆదాయం రావడం లేదు. అధికంగా రైతులు నష్టపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండీ దూది 90 వేల రూపాయలు ఉంది. దూది ఒక కిలో 265 రూపాయలు మార్కెట్లో కొనుగోలు జరుగుతుంది. ఇక్కడ మాత్రం కిలో దూది 150 రూపాయలకు మించి అమ్మకాలు సాగడం లేదు. అత్యధిక లాభాలు అర్జించే మధ్య దళారులను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు 12000 రూపాయలు వచ్చే విధంగా ధర నిర్ణయించి అమలు చేయాలి. సీసీఐ కొనుగోలు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను చూస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఈసారి రైతులు బాగా దివాలా తీశారు. ఇలాంటి స్థితిలో వాళ్లకు ధరలు తగ్గిస్తే అప్పులపాలై ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే ఏటా దేశంలో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో పత్తి, కౌలు రైతులే ఎక్కువ. ఇలాంటి స్థితిలో పత్తి రైతులకు క్వింటాలకు 12 వేల రూపాయలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బోనస్‌ రూపంలో నైనా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేకపోతే రైతాంగాన్ని కదిలించి ఆందోళన, పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.సంకె రవి, అత్తే సాగర్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు , ఎర్మ పున్నం, అబ్దుల్లా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఈ ధర్నాకు మద్దతుగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, గోమాత ప్రకాష్ దూలం శ్రీను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, భాగం రాజారాం,కుమారి జిల్లా సహాయ కార్యదర్శులు, జయరాజ్ ఐఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి , భూక్యా రాజు బిఎస్పి అసిఫాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు,కాదశి రవీందర్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు, శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు,రాజు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, బోడంకి చందు మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి,కే. ప్రేమ్ కుమార్, రమేష్,రైతులు తిరుపతి, శరత్,రవి, మల్లయ్య, బానేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News