ఆగస్టు 24 న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి హామీ 12 వేలు ఇవ్వాలి: చలమాల విఠల్ రావు,(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు)
నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని
వియం బంజర్ సెంటర్లో కొత్తగూడెం రోడ్డు ఆటో అడ్డాలో కార్మికుల సంబంధించి బందు జయప్రదం చేయాలని పోస్టర్, ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జే పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ ఈనెల 24వ తారీఖున జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర బందును జయప్రదం చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని, ఆర్టీసీ యాజమాన్యానికి ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని, ఈ డిమాండ్స్ సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో 24 వ తారీకు జరిగే బందును జయప్రదం చేయలేని అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిట్టి మొదల.కృష్ణ,నల్లమల్ల అరుణ్ ప్రతాప్, ఆటో వర్కర్స్ యూనియన్ బాధ్యులు ఎస్కే బాజీ ఎం. విజయ్, వి. శ్రీనివాస్, ఆర్. వెంకటేశ్వరావు,జే. వెంకటేశ్వరరావు, మిద్దె శ్రీను, పూదూరి.చంటి, నాగేశ్వరావు, ఆర్. సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.
