E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
సత్తుపల్లి 108 టెక్నీషియన్ కు భట్టి చేతుల మీదుగా పురస్కారం

శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవo సందర్భంగా ఖమ్మంలో జరిగిన 80 వ స్వతంత్ర దినోత్సవవేడుకలో 108 సర్వీస్ లో జిల్లాస్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన సత్తుపల్లి 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ కు పురస్కారం దక్కింది.తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ప్రశంసాపత్రం ఇచ్చారు.కృష్ణను జిల్లా కలెక్టర్ టి.ఏస్.దివాకర(ఐఏఎస్),సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ బి.సురేష్ నారాయణ,108 కార్యక్రమ మేనేజర్ షేక్ నజీరుద్దీన్,108 సేవా జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్,తోటి ఉద్యోగులు,మీడియా మిత్రులు అభినందిచారు.
