ఇందిరమ్మ ఇల్లు… ప్రతి కుటుంబం సొంతింటి కలకు చిరునామా

సర్పంచ్ జిట్టబోయిన రమ్య ప్రశాంత్
పాలకుర్తి మండలం –ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బొమ్మెర గ్రామానికి చెందిన లక్కం కోమలత – నాగరాజు మరియు బొల్లం మల్లేష్ కుటుంబం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహంలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ జిట్టబోయిన రమ్య -ప్రశాంత్ ,, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ . అనంతరం మాట్లాడుతూ“పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.”
తమ సొంతింటి కలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కొత్త ఇల్లు… కొత్త ఆశలు… కొత్త భవిష్యత్తు!ప్రజల సంక్షేమమే లక్ష్యం – ప్రజా సేవే మా బాధ్యత! ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తిని సురేష్, వార్డ్ మెంబర్ కొండ శ్రీను , నాయకులు బత్తిని రవి ,సుడిగాల శివరాత్రి కొమురయ్య, బొల్లం నరేష్ జంపాల అనిల్, ఉడుత నరేష్ జోగు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
