
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
కుల వివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు
సావిత్రిభాయి పూలే దేశానికి చదువుల తల్లి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
శాస్త్ర సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ గ్రామ సీమల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని దీనిని సహించబోమని ఏప్రిల్ నెల ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.
సోమవారం నల్గొండ దొడ్డి కొమురయ్య హాల్ లో జరిగిన కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు, క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి, హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు పట్టణాల్లో దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు ఇంకా అనేక రూపాల్లో కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందన్నారు వీటన్నిటిని పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగబద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడంలేదన్నారు ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలన్నారు ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు కుల వివక్ష అంటరానితనం ఎక్కడ కొనసాగితే అక్కడ ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటం నిర్మించాలన్నారు కులవివక్ష అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలనకు కేవీపీఎస్ సన్నద్ధం అవుతుందన్నారు
కులవివక్ష అంటరానితనం కుల దురహంకారహత్యలు సాంఘిక బహిష్కరణలు జోగిని వ్యవస్థ ఇలాంటి వాటిని పారద్రోలటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రాజ్యాంగ హక్కులు, చట్టాలు అమలుకోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు
ఈ సమావేశంలో చదువుల తల్లి సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి సభనిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సావిత్రిభాయి పూలే మాత్రమే ఈ దేశానికి చదువుల తల్లి అన్నారు సరస్వతి దేవి మతోన్మాదుల సృష్టి మాత్రమే కానీ నిజమైన చదువుల తల్లి సావిత్రిభాయి పూలే అన్నారు అందరికి ఉచితంగా ఉన్నత విద్య అందించడమే సావిత్రిభాయి పూలే ఆశయం అన్నారు .
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ
జిల్లా అభ్యుదయ బావాలకు నిలయంగా జన్నప్పటికి ఇంకా కులవివక్ష కొనసాగుతుందన్నారు. ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నాం అన్నారు నాడు కేవీపీఎస్ ప్రణయ్ కుటుంబానికి అండగా ఉంటే మతోన్మాద శక్తులు మారుతిరావు కు మద్దతుగా నల్గొండలో ప్రదర్శన నిర్వహించామని చెప్పారు వారికి ఈ తీర్పు కనువిప్పు కలుగాలన్నారు..
ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రెమిడాల పర్శరాములు బొట్టు శివకుమార్,కోడి రెక్క రాధిక, గాదె నరసింహ ,కోడి రెక్క మల్లయ్య, బొల్లు రవీంద్ర కుమార్, దైద శ్రీను, వంటే పాక కృష్ణ,పెరిక విజయ్ కుమార్, జిల్లాకమిటి సభ్యులు శ్యామ్, డి నాగార్జున,దండు రవి,వెంకన్న శైలజ, రాజకుమారి, శిరీష తదితరులు పాల్గొన్నారు