దిగ్విజయంగా ఐద్వా మహాసభలుదిగ్విజయంగా ఐద్వా మహాసభలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 January, 2026E69NEWS

దిగ్విజయంగా ఐద్వా మహాసభలు

దిగ్విజయంగా ఐద్వా మహాసభలు

మహాసభం నిర్ణయాల వెలుగులో పోరాటాలకు శ్రీకారం సభలకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. విలేకర్ల సమావేశంలో పుణ్యపతి, మల్లు లక్ష్మి

ఈ నెల 25నుంచి 28 వరన అఖిల భారత ప్రజాత్వుక మహిళా సంఘం ఐద్వా ) 14వ మహిసభణ హైదరాబాద్లో దిగ్విజయంగా జరుగాయి, సభజ విజయవంతానికి ఆర్థికంగా, హార్ధికంగా సహకరించిన ప్రతి ఒక్కదకృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్ పుణ్యవత్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు టి. జ్యోతి, రాష్ట్ర కార్యకర్మలు కేఎస్ అశాలత, బుగ్గవీటి సరళ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఐద్వా సభల విజయవంతానికి మహాసభల ఆహ్వాన సంఘం నేతలు, సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు, వాలంటీర్తు తమ శక్తికి మించి కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం, ఆర్జీన్ ఎండి నాగిరెడ్డి సహకారం మరువలేనీడని తెలిపాడు. జొహెచ్ఎపికి చెందిన పాఠశ ధ్యకార్మికులు ఆహర్నిషలు పనిచేశాదరి ప్రశంసించారు. మహాసభల విజయవంతానికి 23 కమిటీలు వేశామనీ, ఆ కమిటీలన్నీ సమర్థవంతంగా పనిచేశామని పేర్కొన్నారు. బహిరంగ సధతో పాటు, మహాసభలలో అద్భుత కళాప్రదర్శనలు ఇచ్చిన ప్రజానాట్యమండలి బృందానికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.
భర్తవ్యాల అమలు కోసం సమరశీల పోరాటాలు.
నాలుగు రోజుల మహాసభలో పలు అంశాలపై కమిషన్లు వేసి చర్చించామనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనువరిస్తున్న విధానాల ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉందనీ, వాటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సమర శీల పోరాటాలు నిర్వహించాలని మహాసభ నిర్దేశించిందని ఐద్వా అఖిలభారత ఉపాధ్యక్షులు ఎ పుణ్యవతి తెలిపారు. మహాసభలకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్, త్రిపుర, అండమాన్ తదితర 36 రాష్ట్రాల నుంచి 800 మంది ప్రతినిధులు హజర్ మ్యారని తెలిపారు సమాజంలో వస్తున్న మార్పుల వల్ల గతం కంటే మహిళా ఉద్యమాల ప్రభావం పెరిగిందనీ, ఈ నేపథ్యంలోనే మహానభంలో పలు మహిళా సమస్యలపై పొలాలు కర్తవ్యాలను తీసుకున్నట్లు వివరించారు. ఏడు కమిషన్ పత్రాలను మహాసభ చర్చించిందని వాటిని ఎదవంగా సభ. ఆమోదించిందని తెలిపారు. 1951లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడే నాటికి తొమ్మిది రాష్ట్రాల్లో ఉంటే ఇప్పుపడు 26 రాష్ట్రాలో సంఘం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ఆర్ధిక, సాంఘీక, సాంస్కృతిక రంగాల్లో మహిళా ఉద్యమాల జోక్యం పెంచాల్సిన అవసరాన్ని మహాసభ గుర్తించిందని తెలిపారు. సామ్రాజ్యవాదం దురహంకారంతో వెనుకబడిన దేశాలపై ముఖ్యంగా పాలస్తీనాపై దాడులు చేయటం వల్ల పేదలు, అందులో మహిళలు, చిన్నారులు చనిపోతున్నారనీ, అక్కడ హృదయ విధాకర దృష్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉన్న ఉపాధికి ఎసరు పెట్టారని విమర్శించారు. ఉపాధి రహిత విధానాల వల్ల మహిళలు తీవ్ర వేదనకు గురికావాల్సి వస్తున్నదని చెప్పారు. మనువాద భావార విధానాలతో దేశంలోని పౌరుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నదని అందోళన. వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో పేజీ రాయికి చట్టాన్ని తీసుకొచ్చి పేదల ఉపాధికి గండి కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పెద్దఎళ్తున ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో అరుణుజ్యోతి, టి జ్యోతి, త, బుగ్గవీటి సరళ మాట్లాడారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *