పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తా

చదువుతూనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు అన్నారు.వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పర్యటించారు.కళాశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు 30 కుర్చీలు, 5 టేబుల్స్,3 టీచర్స్ కుర్చీలను అందజేశారు.విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఫ్యాన్లు, లైట్లు కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాలని,ఆశీర్వదించారు.విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రభుత్వ విద్యాసంస్థలేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం,మౌలిక సదుపాయాలు,పరిశుభ్రమైన తరగతి గదులు,తాగునీరు, మరుగుదొడ్లు,డిజిటల్ రూములు ఉండే విధంగా ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, వర్ధన్నపేట మండల అధ్యక్షులు గోశాల వెంకన్న,ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు దేవస్థాన చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు పాపారావు, వాణి కుమారస్వామి, కిమా నాయక్, ప్రిన్సిపాల్ సుజాత, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
