హైదరబాద్ : ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి మరియు బీ ఆర్ ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతె శోభన్ రెడ్డి తో కలిసి తార్నాక లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ డివిజన్ పరిదిలో జరుగుతున్న పల్లు అభివృద్ధి కార్యక్రమాలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగ అధికారులను అడిగి తెలుసుకున్నారు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు స్ట్రోమ్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులు,సీసీ రోడ్డు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మరియు స్విమ్మింగ్ పూల్ తదితర పనులను నాణ్యతతో త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు,ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హేమలత, ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశాలత గారు, డిప్యూటీ ఇంజనీర్ సువర్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.