కురవి మండలం సుదనపల్లి గ్రామంలో విషాద ఘటన
BREAKING NEWS
ఐకెపి సెంటర్ లో పిడుగు పడి రైతు మృతి
తెలుగు గళం న్యూస్
మహబూబాబాద్ మే03
డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం సుదనపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద పిడుగు పడటంతో రైతు నీలం వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు