congress news mp elections news local news telugu galam news daily news e69news శాయంపేట మండలం పెద్దకోడపాక,మైలారం

శాయంపేట మండలం పెద్దకోడపాక,మైలారం
గ్రామాలలొ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య ని అధిక మెజారిటీతో గెలిపించాలని అందుకోసం మనమంతా చిన్న పెద్ద తేడా లేకుండా పాత కొత్త తేడా లేకుండా కష్టపడి పని చేయాలని సమిష్టి కృషితో శాసనసభ ఎన్నికలలో నాకు ఇచ్చిన మెజారిటీ కంటే అధిక మెజార్టీని ఇవ్వాలని కోరారు.
జాతీయ రాజకీయాలలో ఇందిరాగాంధీీ రాజీవ్ గాంధీ లాంటి మహానుభావులు దేశ ప్రగతి కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని ముందుకు నడిపారని అన్నారు,అదే త్రోవలో సోనియాగాంధీ తనకు వచ్చిన ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం పాటుపడారని అన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు దేశంలో మోడీ చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్నారు.
కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెడుతున్న ఈ నిరంకుశ
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ కుటుంబ సభ్యులు,కాంగ్రెస్ అభిమానులు,మీడియా మిత్రులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News