సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో. ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఉగాది అంటే గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది.చైత్య శుద్ధపౌర్ణమి నాడు వచ్చే పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఉగాది రోజు ముఖ్యమైన వంటకు ఉగాది పచ్చడి సడపచుల సమ్మేళంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.అందరి జీవితాలలో ఈ సంవత్సరం నూతన వసంతాని నింపుతుంది,ఉగాది నుంచి కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుందని చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనొత్తేజం నెలకొంటుందని రైతన్నలు వ్యవసాయ పనులను ఉగాది పర్వదినం నుంచే ప్రారంభిస్తారని ప్రజల నమ్మకం