హన్మకొండ జిల్లాలోని భీమారం ప్రాంతంలోని లార్డ్ స్వచ్చంద సంస్థ ఆథ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీలోని వరంగల్ పట్టణ మహిళా విబాగం(లజ్నా ఇమాయిల్లాహ్)ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని నిరాశ్రయురాలైన ముప్పై మంది వయోజనుల వృద్ద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.అలాగే యాబై మందికి పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ పట్టణ మహిళ అధ్యక్షురాలు నజీమా ఉపాధ్యక్షురాలు రుబీనా మరియు నూర్జహాన్ తలాత్ సలీం ఆసిఫా సలీం నజియా మునిషా సానియా గౌస్య హనిఫా అఫీయ,యాకుబ్బి సలీం తదితరులు పాల్గొన్నారు.