ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు బల్గురు తిరుపతిరావు, జడ్పిటిసి జోరుక సదయ్య
ప్రశ్నించే గొంతుక కోసం బీఆర్ఎస్కే ఓటేద్దాం-మారపల్లి సుధీర్ కుమార్ ని గెలిపిద్దాం
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (మొగుళ్లపల్లి)
భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి, పోతుగల్లు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను ముఖ్య కార్యకర్తలను మరియు ఉపాధి హామీ కూలీలను ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు, జడ్పిటిసి జోరుక సదయ్య ముదిరాజ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని, ఏనాడు ప్రజలకు పథకాల ఆశ చూపలేదని, ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేసిన చరిత్ర గత ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ దే అని వారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఇచ్చి అరిగోస పడుతున్నామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమైపోతామని అన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ని ఆశీర్వదించాలని, పేద వర్గాలకు అండగా నిలచే పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు. మంచి మనస్సున్న డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కి అండగా నిలిచి బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద సంజీవరెడ్డి ,గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ మంద కొమురయ్య, మండల నాయకులు మెరుగు బిక్షపతి, గడ్డం రమేష్ గౌడ్, ముత్యాల శ్రీనివాస్, మంద దశరథం మెరుగు సదయ్య, బండి తిరుపతి, దొంగల రమేష్, వేషాల శ్రీకాంత్, మంద రమణారెడ్డి, మంద పద్మయ్య, కొండయ్య, పోతుగల్లు నాయకులు నరెడ్ల రాజు , రేణిగుంట్ల మొగిలి ,మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.