లంబాడీ గిరిజన సంఘాల నాయకులు
సిపిఎం జిల్లా నాయకులు
మరిగడి గ్రామ మాజీ సర్పంచ్ రమావత్ మీట్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన
లంబాడీ గిరిజన సంఘాల నాయకులు
జనగామ:సిపిఎం జిల్లా నాయకులు,మరిగడి గ్రామ మాజీ సర్పంచ్ రామావత్ మీట్యా నాయక్ సతీమణి రామావత్ కనకలక్ష్మి అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు
ఈ సందర్భంగా లంబాడి గిరిజన సంఘాల సీనియర్ నాయకులు మూడ్ లక్ష్మణ్ నాయక్, భూక్య వాసు నాయక్, బానోత్ హరిలాల్ నాయక్ ,లచ్చయ్య నాయక్ ,ధరావత్ నాగేందర్ ధరావత్ సోముల నాయక్ ,లకావత నరేష్ నాయక్ భూక్యా చందు నాయక్, కొర్ర కాలురామ్ నాయక్ , ధరావత్ ఖీమా నాయక్ పరమర్శించారు అంతరం వారు మాట్లాడుతూ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన మీట్యా నాయక్ గారు చిన్ననాటి నుండే ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ అనేక ఉద్యమాలలో , అదేవిధంగా గిరిజన హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాలలో ముఖ్య భూమిక పోషించారని అనంతరం సిపిఎం పార్టీలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించి మరిగడి
గ్రామానికి సర్పంచ్ గా పనిచేస్తూ ప్రజలందరికీ ధైర్యం చెప్పిన వ్యక్తి అని, ప్రజలకు అందరికీ మంచినీటి సౌకర్యం కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నడిచే విధంగా వాటర్ ప్లాంట్
మరియు సబ్ స్టేషన్ నిర్మాణం చేశారని ఇటువంటి అనేక సేవా కార్యక్రమంలో కుటుంబ సహచరిగా తను చేసే ప్రతి ఆలోచనలో ప్రత్యక్షంగా సహకరిస్తు వచ్చిన రమావత్
మీట్యా నాయక్ గారి సతీమణి రమావత్ కనకలక్ష్మి గత ఏడు సంవత్సరాల నుండి అనారోగ్యానికి గురై శ్వాసకోశ వారితో ఇబ్బంది పడుతూ మరణించడం కుటుంబానికి తీరని లోటుని వారు అన్నారు ఈ పరామర్శ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉన్నారు