హన్మకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీరా వెంకట్
హన్మకొండతెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లంబాడ గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని లంబాడి హక్కుల పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీర వెంకట్ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా అజ్మీరా వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 40 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి లంబాడా గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో లంబాడా గిరిజనులే కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ప్రధాన పాత్ర పోషించారని విషయాన్ని కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి దృష్టిలో పెట్టుకోవాలని లంబాడా గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం