అభివృద్ధి చేసి చూపిస్తాం గుమ్మనూరు నారాయణ
గళం న్యూస్, గుత్తి
గుత్తి మండలం సిరిపురం గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.(టిడిపిలోకీ చేరారు ) ఐదు సంవత్సరాలు గా వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని తమ గ్రామాచెరువుకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.సిరిపురం పెద్దరాజు, చిన్న రామకృష్ణ, లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ సమక్షంలో బోలిగొర్ల లక్ష్మణ, కాకర్ల నారాయణ, అనుముల సోమశేఖర్, ఉండ్రా పాపన్న, పెద్దరామకృష్ణ, నడిపి రామకృష్ణ, ఆకుల కుళ్లాయ్ ప్రసాద్,వెంకటేష్, ముత్యాలు, రామాంజి నేయులు టీడీపీ లోకి చేరారు. పార్టీ లోకి చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యే గా గెలిపించాలని, కచ్చితంగా చెరువుకు నీళ్లు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుత్తి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.