శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు కొత్తూరులో ముంటిమడుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి కోడిదల తిరుపాల్, ఏ. సుదీర్, కే. కృష్ణయ్య, ఏ. రామసుబయ్య, కోటపాటి శ్రీనివాసులు, తమినేని మురళి, కే. నరేష్, కే. మహేష్, టి. కోదండ పది కుటుంబాలు పార్టీ లోకి చేరారు. పార్టీ లోకి చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ అన్ని విధాలుగా తోడుంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మజ్జల నాగేంద్ర, వడ్ల రాము, ఇల్లూరు సుంకన్న, ఇల్లూరు నాగేంద్ర, రామాంజినేయులు ఆచారి, తరుణ్ ఆచారి, కనుంపల్లి హరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.