భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి ఎస్కే రెహమాన్ గుప్త నిధుల ముఠాని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు సూర్యపేట జిల్లా మిర్యాలగూడ గ్రామానికి చెందిన గొర్రెల కాపారులను ఎంపిక చేసుకొని వారిని నమ్మించి పాల్వంచ దగ్గర సాటివారిగూడెం అడవి ప్రాంతంలో పిలిపించుకున్నారు మా దగ్గర రెండు కోట్ల రూపాయలు గుప్త నిధులకు సంబందించిన డబ్బులు ఉన్నవి మా దగ్గర గొర్రెలు లేవు 50 లక్షలు ఇచ్చి రెండు కోట్ల రూపాయలు తీసుకొని వెళ్లండి అని చెప్పి మరొక రోజు 40 నుండి 35 లక్షల రూపాయలు తీసుకొని రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి తెల్ల కాగితాలు ఇచ్చారు వీరిని గుర్తించిన లక్ష్మీదేవి పల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు తిరువూరు మండలం చెందిన వ్యక్తి మీద అనేక కేసులు అలాగే ఇలాంటి మోసాలకు దిట్టా అని డీఎస్పీ తెలియజేశారు. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు.