అనంతపురం జిల్లా శిoగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం పరిదిలోని తిమ్మంపేట మరియు ముంటిమడుగు, రాందాస్ పేట అంకంపేట, ముంటిమడుగు కొత్తూరు, ముంటిమడుగు కొత్తపల్లి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ ( జనసేన, బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంను దిసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి మరియు ఏక్స్ ఎంపీపీ ముంటీమడుగు శ్రీనివాస్ రెడ్డి మరియు బండారు కిన్నెర శ్రీ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేయజేశారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ ను గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ విశాలాక్షి,ఎంపిటిసి సురేంద్ర రెడ్డి,మండల కన్వీనర్ పాండు, సామల మధు, రామాంజినేయులు ఆచారి, సామల రామాంజినేయులు, వడ్ల రాము, కొత్తపల్లి గంగాధర్, చిన్నా, సదానంద నాయుడు , కృష్ణ,తరుణ్ ఆచారి,కే. మహేష్,ఇల్లూరు నాగేంద్ర, మజ్జల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.