ec news elections news telugu news local news telugu galam news telugu varthaluజిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.
  • జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.

మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉత్త ర్వులు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ సింగ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నెల 13 న జరగనున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా
(16 ) మహబూబాబాద్ పార్లమెంట్ లోని అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో డోర్నకల్ , మహబూబాబాద్, నర్సంపేట నియోజక వర్గాలలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ( ఈసీ) ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.గత ఎన్నికల నియమావళి ప్రకారం ఉదయం 7 నుండి 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల ప్రక్రియను వేసవి ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఒక్క గంట సమయాన్ని పెంచారని, ఈ అవకాశాన్ని నియోజక వర్గ ఓటర్లు వినియోగించు కోవలసిందుగా జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News