e69news telug galam local newse69news telug galam local news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని
శ్రీ సందీప శ్రీకృష్ణఆశ్రమాన్ని సందర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ఆశ్రమం లో సద్గురు బోధ కార్యక్రమాన్ని వీక్షించి,
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.సద్గురు బోధ ద్వారా
చాలా మంచి విషయాలు తెలుస్తాయి, సమాజము మరియువ్యక్తిగత నడవడి
గూర్చి అనేక విషయాలు తెలుసు కోవచ్చు అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా అవకాశం ఇచ్చిన గురుపెద్దలకుఆశ్రమ గురువుశ్రీ బండి చక్రపాణి సలానంద గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆశ్రమ అభివృద్ధి కోసం మీలో ఒకడిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయనిహామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ గురువు బండి చక్రపాణి,కట్ల సంజీవరెడ్డి,కట్టంగూరి మనోహర్ రెడ్డి,పట్టెం శంకర్,ఏనుగు రవీందర్,గండ్రెడ్డి రవీందర్ రెడ్డి,గూటంలింగారెడ్డి,ఎర్రబాటి రాజేశ్వరరావు,రొంటాల సదానందం,
మీడియా మిత్రులు, గురు భక్తులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News